సోదరుడిపై విల్లంబుతో దాడి
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:23 AM
వెలుగోడు పట్టణంలోని చెంచు గూడెంలో అన్నదమ్ముళ్ల ఘర్షణలో విల్లంబుతో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.
వెలుగోడు, ఏప్రిల్ 17: వెలుగోడు పట్టణంలోని చెంచు గూడెంలో అన్నదమ్ముళ్ల ఘర్షణలో విల్లంబుతో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. గూడేనికి చెందిన ఈదన్నపై తన సోదరుడు, విల్లంబుతో దాడి చేయగా విల్లంబు వీపులో దిగి తీవ్రంగా రక్త స్రావమైంది. వెంటనే బాధితుడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.