Share News

రెహిమాన్‌పురంలో అమ్మవార్ల జాతర

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:43 PM

మండలంలోని రెహిమాన్‌పురం గ్రామంలో పెద్దమ్మ, సుంకులమ్మ అమ్మవార్లకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం జాతర నిర్వహించారు.

రెహిమాన్‌పురంలో అమ్మవార్ల జాతర
సుంకులమ్మను దర్శించుకుంటున్న భక్తులు

బేతంచెర్ల, జనవరి 17: మండలంలోని రెహిమాన్‌పురం గ్రామంలో పెద్దమ్మ, సుంకులమ్మ అమ్మవార్లకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం జాతర నిర్వహించారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని 54 ఏళ్ల తర్వాత గ్రామంలో సుంకులమ్మ, పెద్దమ్మ జాతర నిర్వహించినట్లు గ్రామస్థులు తెలిపారు. అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి, మండల కన్వీనర్‌ ఎల్ల నాగయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి, టీడీపీ నాయ కులు, కార్యకర్తలు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బేతంచెర్ల సీఐ ప్రియతమ్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ శివశంకర్‌ నాయక్‌ గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Jan 17 , 2024 | 11:43 PM