ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:24 AM
జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో నిర్వహిస్తున్న ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి శామ్యూల్కు ఎస్ఎఫ్ఐ జిల్లా అధక్షుడు రం గప్ప, కార్యదర్శి అబ్దుల్లా శనివారం వినతిపత్రం అందజేశారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), మార్చి 2: జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో నిర్వహిస్తున్న ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి శామ్యూల్కు ఎస్ఎఫ్ఐ జిల్లా అధక్షుడు రం గప్ప, కార్యదర్శి అబ్దుల్లా శనివారం వినతిపత్రం అందజేశారు. ఈసంద ర్భంగా వారు మాట్లా డుతూ విద్యాసంవత్సరం పూర్తి కాకముందే కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో పోస్టర్లు, బ్యానర్ల ద్వారా అడ్మిషన్లు చేస్తు న్నారన్నారు. ఫీజులో మినహాయింపు ఉంటుందని, విద్యార్థుల తల్లిదండ్రు లను మభ్యపెట్టి ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నారన్నారు. కార్యక్ర మంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు అమర్ పాల్గొన్నారు.