Share News

ఆంజనేయ స్వామికి అభిషేకం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:15 AM

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వెలసిన బీగాల ఆంజనేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆంజనేయ స్వామికి అభిషేకం
అహోబిలంలో ఆంజనేయస్వామికి అభిషేకం చేస్తున్న అర్చకులు

ఆళ్లగడ్డ, జనవరి 11: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వెలసిన బీగాల ఆంజనేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రహ్లాద వరదులు, ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవిని బీగాల ఆంజనేయస్వామి వద్దకు అర్చకులు ఉదయాన్నే చేర్చారు. అక్కడ ప్రహ్లాద వరదులకు నవ కలశ స్నపన అభిషేకం, సాయంత్రం తిరువడి కోవెలలో హనుమజ్జయంతి విశేష ఆస్థానం, గోష్టి కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు.

కొనసాగుతున్న ధనుర్మాస పూజలు

అహోబిలంలో ధనుర్మాస పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం వేకువజామున్నే ఉత్సవమూర్తులైన ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పాటు గోదాదేవి అమ్మవారికి తిరుప్పావై, సేవాకాలం, శాత్తుమురై, గోష్టి కార్యక్రమాలను నిర్వహించారు.

ు.

Updated Date - Jan 12 , 2024 | 12:15 AM