మంత్రి బుగ్గనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ABN , Publish Date - May 15 , 2024 | 12:11 AM
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పట్టణంలో మంత్రి బుగ్గన ఇంటి సమీపంలో రిటైర్డు అడిషినల్ ఎస్పీ పీఎన్ బాబును కులం పేరుతో తిట్టిన మంత్రి బుగ్గన, ఆయన అనుచరులు చలంరెడ్డి, నాగరాజు, నాగేశ్వరరావుతోపాటు మరో 30 మంది వైసీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ మాసూమ్ మంగళవారం తెలిపారు.
![మంత్రి బుగ్గనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బేతంచెర్ల, మే 14: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పట్టణంలో మంత్రి బుగ్గన ఇంటి సమీపంలో రిటైర్డు అడిషినల్ ఎస్పీ పీఎన్ బాబును కులం పేరుతో తిట్టిన మంత్రి బుగ్గన, ఆయన అనుచరులు చలంరెడ్డి, నాగరాజు, నాగేశ్వరరావుతోపాటు మరో 30 మంది వైసీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ మాసూమ్ మంగళవారం తెలిపారు. ఎన్నికల పోలింగ్లో భాగంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన అనుచరులు పల్లెలు తిరుగుతూ ఇంటికి రాగా వారి వెనుకాల వెంబడిస్తూ వస్తున్న రిటైర్డ్ అడిషినల్ ఎస్పీ పీఎన్ బాబు డ్రైవర్లను కులం పేరుతో దూషించారని పీఎన్ బాబు ఫిర్యాదు చేశారని హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే మంత్రి బుగ్గన తన ఇంట్లో పని చేసే జయలచ్చమ్మ అనే మహిళతో పీఎన్ బాబు, ఆయన డ్రైవర్పైన కూడా కేసు నమోదు చేయించారు. పీఎన్ బాబు డ్రైవర్ కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ తన మీదకు తీసుకొచ్చాడని జయలచ్చమ్మ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పీఎన్ బాబుతోపాటు ఆయన డ్రైవర్పై కేసు నమోదైనట్లు ఆయన తెలిపారు.