వేధింపులపై కేసు నమోదు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:49 AM
అదనపు కట్నం కోసం ఓ మహిళను భర్త, అత్త వేధింపులకు గురి చేయడంతో వాళ్ళిద్దరిపై కేసు నమోదు చేసినట్లు కోవెలకుంట్ల ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు.
కోవెలకుంట్ల, ఏప్రిల్ 24: అదనపు కట్నం కోసం ఓ మహిళను భర్త, అత్త వేధింపులకు గురి చేయడంతో వాళ్ళిద్దరిపై కేసు నమోదు చేసినట్లు కోవెలకుంట్ల ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. బుధవారం ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు పట్టణా నికి చెందిన శ్రీనిధిని గుంతకల్లుకు చెందిన తేజ్ కుమార్తో 2019లో వివాహం జరిపించారు. వీరి దాంపత్య జీవితం కొంతకాలం సజావుగా సాగింది ఇటీవల భర్త తేజ్కుమార్, అత్త ఇద్దరు కలిసి అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేస్తున్నారని కోవెలకుంట్ల స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.