Share News

97,254 మంది మహిళలకు లబ్ధి: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:22 AM

వైఎస్సార్‌ చేయూత పథకం కింద జిల్లాలో 97,254 మంది మహిళలకు నాలుగో విడత ఆర్థిక సాయంగా రూ.182.35 కోట్లు జమ చేశామని కలెక్టర్‌ కె.శ్రీనివాసులు తెలిపారు.

97,254 మంది మహిళలకు లబ్ధి: కలెక్టర్‌
లబ్ధిదారులకు జంబో చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ తదితరులు

నంద్యాల (కల్చరల్‌), మార్చి 7: వైఎస్సార్‌ చేయూత పథకం కింద జిల్లాలో 97,254 మంది మహిళలకు నాలుగో విడత ఆర్థిక సాయంగా రూ.182.35 కోట్లు జమ చేశామని కలెక్టర్‌ కె.శ్రీనివాసులు తెలిపారు. గురు వారం అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసినికాడ నుంచి సీఎం జగన్‌ వైఎస్సార్‌ చేయూత పథకం కింద నగదు జమ చేసే కార్యక్రమాన్ని బటన్‌ నొక్కి ప్రారంభించారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ మైనారిటీ సలహాదారులు హబీబుల్లా, హస్త కళల డైరక్టర్‌ సునీత అమృతరాజ్‌, బెస్త సంక్షేమ సంఘం డైరక్టర్‌ చంద్రశేఖర్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ డైరక్టర్‌ శశికళ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, లబ్ధిదారులు వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు జంబో చెక్కును అందజేశారు.

Updated Date - Mar 08 , 2024 | 12:22 AM