Share News

‘పది’ పరీక్షలకు 773 మంది గైర్హాజర్‌

ABN , Publish Date - May 25 , 2024 | 11:33 PM

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు 773 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

‘పది’ పరీక్షలకు 773 మంది గైర్హాజర్‌

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మే 25: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు 773 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1151 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. 378 మంది పరీక్షకు హాజరు కాగా, 773 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి శామూయేల్‌ నాలుగు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 16 పరీక్ష కేంద్రాలను పరిశీలించాయి. ఎలాంటి మాల్‌ ప్రాక్టీసు కేసు నమోదు కాలేదు.

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు 9288 మంది నమోదు చేసుకున్నారు. 8970 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 315 మంది గైర్హాజరయ్యారు. కర్నూలు బీ క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డిబార్‌ చేశారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 906 మంది నమోదు చేసుకున్నారు. 830 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 76 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఆర్‌ఐవో గురువయ్యశెట్టి, డీవీఈవో జమీల్‌ ఫాషా, స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షించాయి.

Updated Date - May 25 , 2024 | 11:33 PM