Share News

10 నుంచి మలి విడత శిక్షణా తరగతులు

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:47 PM

జిల్లాలో పీవో, ఏపీవో, ఓపీవోలకు ఈ నెల 10వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా రెండో విడత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి.

10 నుంచి మలి విడత శిక్షణా తరగతులు

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 6: జిల్లాలో పీవో, ఏపీవో, ఓపీవోలకు ఈ నెల 10వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా రెండో విడత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాలకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మిగతా నియోజకవర్గాలకు అన్నీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. పీవో, ఏపీవో, ఓపీవోల నియామక ఉత్తర్వులు అందిన ప్రతి ఒక్క అధికారి శిక్షణా తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Apr 06 , 2024 | 11:47 PM