డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రూ.10 లక్షలు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:43 AM
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రూ.10 లక్షలు రుణాలు ఇస్తామని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
డోన్, ఏప్రిల్ 24: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రూ.10 లక్షలు రుణాలు ఇస్తామని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. బుధవార రాత్రి మండలంలోని కొత్తకోట గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడు, సీఎం శ్రీనివాసులు, గంధం శ్రీనివాసులు పాల్గొన్నారు. డోన్ టీడీపీ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్, సీనియర్ న్యాయవాది హను మంతరెడ్డి కోట్ల సుజాతమ్మ సమక్షంలో టీడీపీలో చేరారు. అదేవిధంగా డోన్ మండలంలోని తాడూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు బత్తిన జయరాముడు, మల్లయ్య, జనార్దన్, మల్లికార్జున, బంగారు రాజు తోపాటు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి.