1 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
ABN , Publish Date - May 27 , 2024 | 11:32 PM
ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ సామూయేలు సోమ వారం తెలిపారు.
![1 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు(ఎడ్యుకేషన్), మే 27: ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ సామూయేలు సోమ వారం తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. పది పరీక్షలకు మెత్తం 930 మంది హాజరవుతున్నారని తెలిపారు. అదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండలో 5 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఇంటర్ పరీక్షలకు 1265 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 10 నుంచి 12వ తేది వరకు జరుగుతున్నట్లు ఆయన వివరించారు.