Share News

గ్రామానికి, నాకు అన్యాయం చేశావ్‌

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:31 AM

‘‘మా గ్రామం ఏం పాపం చేసిం ది. మైలవరం మండలంలోని అన్ని పంచాయతీలకు ఎంపీ నుంచి వాటర్‌ ట్యాంక్‌లు ఇప్పించావు. నా పంచాయతీకి ఎందుకు ఇప్పించలేదు.’’ అని వైసీపీ మైలవరం మండల ఇన్‌చార్జి నారాయణను చండ్రగూడెం సర్పంచ్‌ శ్రీను(వైసీపీనేత) ఫోన్‌లో ప్రశ్నించారు.

గ్రామానికి, నాకు అన్యాయం చేశావ్‌

కుష్ఠు వస్తుందని వైసీపీ మైలవరం మండల ఇన్‌చార్జికి చండ్రగూడెం సర్పంచ్‌ శాపనార్థాలు

మైలవరం రూరల్‌, జనవరి 29: ‘‘మా గ్రామం ఏం పాపం చేసిం ది. మైలవరం మండలంలోని అన్ని పంచాయతీలకు ఎంపీ నుంచి వాటర్‌ ట్యాంక్‌లు ఇప్పించావు. నా పంచాయతీకి ఎందుకు ఇప్పించలేదు.’’ అని వైసీపీ మైలవరం మండల ఇన్‌చార్జి నారాయణను చండ్రగూడెం సర్పంచ్‌ శ్రీను(వైసీపీనేత) ఫోన్‌లో ప్రశ్నించారు. దీంతో నాకు సంబంధం లేదు. ఎంపీని అడుక్కో అని నారాయణ సమాధానమిచ్చాడు. నీకు సంబంధం లేకుంటే ఇన్నాళ్లూ అన్ని విషయాల్లో ఎందుకు కలుగ చేసుకున్నావని శ్రీను ప్రశ్నించారు. నేను బీసీ సర్పంచ్‌ని అని అధికార పార్టీ ప్రజా ప్రతి నిధిగా ఆస్తులు అమ్ముకున్నాని, నాకు, నా పంచాయతీకి నువ్వు అన్యా యం చేశావని శ్రీను వాపోయాడు. గ్రామ ప్రథమ పౌరుడవైతే నాకేమైన లావా అని నారాయణ ఎదురు ప్రశ్నించాడు. బీసీలం నీకు ఏం అన్యా యం చేశామని, ఏదైనా ఎమ్మెల్యేకు చెబితే నారాయణకు చెప్పమంటు న్నారు. నాకు అన్యాయం చేసిన వాడికి కుష్ఠు వ్యాధి వస్తుందని ఫోన్‌లోనే నారాయణకు శ్రీను శాపనార్థాలు పెట్టడంతో నారాయణ కూడా తనను అన్నవారికి అంతకంటే భయంకర వ్యాధులు వస్తాయని శాపనార్థాలు పెట్టాడు. ఈఫోన్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

Updated Date - Jan 30 , 2024 | 01:31 AM