Share News

వైసీపీ వైఫల్యాలు ఎండగట్టాలి

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:58 AM

రాష్ట్రంలో వైసీపీ దురాగతాలు, వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లో ఎండగట్టడంతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని టీడీపీ పెనమలూరు అభ్యర్థి బోడె ప్రసాద్‌ పిలుపునిచ్చారు. కాటూరులో సోమవారం టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామపెద్దల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

వైసీపీ వైఫల్యాలు ఎండగట్టాలి
కాటూరులో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న బోడె ప్రసాద్‌

కాటూరు(ఉయ్యూరు), మార్చి 25 : రాష్ట్రంలో వైసీపీ దురాగతాలు, వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లో ఎండగట్టడంతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని టీడీపీ పెనమలూరు అభ్యర్థి బోడె ప్రసాద్‌ పిలుపునిచ్చారు. కాటూరులో సోమవారం టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామపెద్దల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అధఃపాతాళానికి వెళుతుందని, ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి కనుమరుగైందన్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ నాయకులు వెంకటనారాయణ, మోహన్‌రాజు, టీడీపీ మండల అఽధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు, కాటూరు శరత్‌, పోతురాజు, ఆళ్ల శ్రీకాంత్‌, కె. రవి, వి. సత్యనారాయణ, నాగభూషణం పాల్గొన్నారు.

50 రోజులు కష్టపడండి

కంకిపాడు : రానున్న సార్వత్రిక ఎన్నికలకు 50 రోజులు కష్డపడితే సైకో జగన్‌ తరమికొట్టేందుకు వీలుంటుందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. కంకిపాడు మండల పార్టీ కార్యాలయంలో సోమవారం క్లస్టర్‌ మీటింగ్‌తో పాటు క్లస్టర్‌ బీసీ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికలకు క్లస్టర్‌ పరిధిలోని బూత్‌ లెవల్‌ కమిటీలు విశేషంగా కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరినీ పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకువచ్చి టీడీపీ ఓటు వేయించే విధంగా పనిచేయాలన్నారు. అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరినీ కలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చార్జి అన్నే ధనయ్య, టీడీపీ సీనియర్‌ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ, సుదిమళ్ల రవీంద్ర, సెంగెపు రంగారావు, యలమంచిలి కిషోర్‌బాబు, రవి, కొండవీటి శివయ్య, నాగరాజు, బొర్రా వెంకట్‌, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త ముప్పా రాజా తదితరులు పాల్గొన్నారు.

బోడె ప్రసాద్‌ విజయానికి కృషి

పెనమలూరు : నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి బోడె ప్రసాద్‌ విజయానికి అందరూ కలసి కృషి చేయాలని పెనమలూరు క్లస్టరు ఇన్‌చార్జి మారుపూడి ధనకోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో నారా భువనేశ్వరి నియోజకవర్గంలో నిజం గెలవాలి యాత్రను నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ పిలుపునిచ్చిన శంఖారావం, సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలను బూత్‌ కన్వీనర్లు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, కోయ ఆనంద్‌ ప్రసాద్‌, సంగెపు రంగారావు, బొమ్మిడి అన్నపూర్ణ, కొమ్మినేని శ్రీనివాస్‌, మాబు సుభాని, సుంకర రమేష్‌, అబ్దుల్‌ గౌస్‌, కోనేరు వెంకటేశ్వరరావు, దొండపాడు సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:58 AM