ఎన్నికల తర్వాత వైసీపీ కనుమరుగు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
ABN , Publish Date - Jan 29 , 2024 | 01:09 AM
‘‘వైసీపీ దురాగతాలకు ప్రజాకోర్టులో శిక్షపడే సమయం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొద లైంది. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ను గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలైంది..టీడీపీ అం దుకు సిద్ధమైంది. ఎన్నికల్లో వైసీపీ బంగాళాఖాతంలో కలవడం ఖాయం. టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఎన్నికల తర్వాత వైసీపీ జెండా కనుమరుగవుతుంది.’’ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
పటమట, జనవరి 28: ‘‘వైసీపీ దురాగతాలకు ప్రజాకోర్టులో శిక్షపడే సమయం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొద లైంది. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ను గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలైంది..టీడీపీ అం దుకు సిద్ధమైంది. ఎన్నికల్లో వైసీపీ బంగాళాఖాతంలో కలవడం ఖాయం. టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఎన్నికల తర్వాత వైసీపీ జెండా కనుమరుగవుతుంది.’’ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అశోక్నగర్లోని తన కార్యాలయంలో ఆది వారం ఆరుగురు రజకులకు ఆయన ఇస్ర్తీపెట్టెలను అందజేశాక మాట్లాడారు. జగన్ అహంకారానికి, వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు రైతులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు అంతా సిద్ధమ య్యారన్నారు. పంట నష్టపోయిన రైతులు, ఉద్యోగాలు రాని యువత, దగాపడిన మహిళలు టీడీపీకి స్టార్ క్యాంపెయినర్లు అని గద్దె పేర్కొన్నారు. వేముల దుర్గారావు, చెన్నుపాటి గాంధీ, మొకర వెంకట రమణ, పలిశెట్టి అన్నారావు, బిప్పాడ నాగేశ్వరరావు, గద్దె రమేష్, అం బడి పూడి కాశీ తదితరులు పాల్గొన్నారు.