యార్లగడ్డ గెలిచారని కాలినడకన జోసఫ్ తంబి చర్చికి..
ABN , Publish Date - Jun 08 , 2024 | 01:30 AM
గన్నవరం ఎమ్మెల్యేగా యార్లగడ్డ వెంకట్రావు అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో ఆయన అభిమాని కె.సీతారాంపురం గ్రామానికి చెందిన అమృతరావు తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం జోసఫ్తంబి చర్చిలో మొక్కులు తీర్చేందుకు కాలినడ కన వెళ్లారు.
![యార్లగడ్డ గెలిచారని కాలినడకన జోసఫ్ తంబి చర్చికి..](https://media.andhrajyothy.com/media/2024/20240604/7hjr01_209f0d562a.jpg)
హనుమాన్జంక్షన్రూరల్: గన్నవరం ఎమ్మెల్యేగా యార్లగడ్డ వెంకట్రావు అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో ఆయన అభిమాని కె.సీతారాంపురం గ్రామానికి చెందిన అమృతరావు తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం జోసఫ్తంబి చర్చిలో మొక్కులు తీర్చేందుకు కాలినడ కన వెళ్లారు. ఎన్నికల ముందు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్ర మంలో భాగంగా తన ఇంటికి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు భారీ మెజారిటీతో గెలవాలని మొక్కుకున్నట్లు ఆయన సమక్షంలోనే అమృతరావు తెలిపారు. లక్కపాముల రాజు, మరియమ్మ, లక్కపాముల పుష్పలత, కొడాలి తంబి, కటాక్షం, జనపరెడ్డి నాగమణి కాలినడకన చర్చికి వెళ్లారు.