Share News

యార్లగడ్డకే అత్యధిక ప్రజామోదం

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:22 AM

గన్నవరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు అని కృష్ణామిల్క్‌ యూని యన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. విజయవాడలోని యార్లగడ్డ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.

 యార్లగడ్డకే అత్యధిక ప్రజామోదం
యార్లగడ్డ వెంకట్రావును అభినందిస్తున్న చలసాని ఆంజనేయులు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, జూన్‌ 5 : గన్నవరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు అని కృష్ణామిల్క్‌ యూని యన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. విజయవాడలోని యార్లగడ్డ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. బాపుల పాడు మండలం నుంచి పలువురు నాయకులు కలిసి అభినందించారు. యజ్జవ రపు రంగారావు, కాటూరి విజయభాస్కర్‌, టీడీపీ నేతలు వేగిరెడ్డి పాపారావు, గొట్టాపు ప్రవీణ్‌, బేతాళ ప్రమీలారాణి , ఆయిల్‌పామ్‌ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బా వీర రాఘవరావు, గుండపనేని ఉమావరప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

హనుమాన్‌జంక్షన్‌: యార్లగడ్డ వెంకట్రావు ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. తెలుగు మహిళా విభా గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి, పార్టీ నాయకులు పుట్టా సురేష్‌, మాదల శ్రీనివాసరావు, చిన్నాల లక్ష్మీనారాయణ, కాటూరి విజయ్‌ భాస్కర్‌, యజ్జవరపు రంగారావు, ఆర్నేపల్లి సూరిబాబు, ఆలూరి సురేష్‌, కలపాల సూర్యనారాయణ, యనమదల శ్రీనివాసరావు, కొండపల్లి వెంకటేశ్వరరావు, కలపాల కుమార్‌, చిన్నందేవి, కర్రా ప్రసాద్‌ ఉన్నారు.

గన్నవరం : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అత్యధిక మెజార్టీతో గెలుపొందటంపై ఆ పార్టీ శ్రేణులు పూలబొకేలు, దుశ్శాలువాలతో సత్కరించి శుభా కాంక్షలు తెలిపారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ పొట్లూరి బసవరావు, ప్రముఖ న్యాయ వాది కెవి రమణ, జాస్తి వెంకటేశ్వరరావు, కెహెచ్‌ కోటేశ్వరరావు, నల్లమోతు రమేష్‌, నిడమర్తి బుజ్జారావు తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 01:22 AM