Share News

వైసీపీ రద్దు చేసిన చేనేత పథకాలన్నీ పునరుద్ధరిస్తాం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:46 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన చేనేత కార్మికుల సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరి స్తామని టీడీపీ-జనసేన-బీజేపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్‌ అన్నారు.

వైసీపీ రద్దు చేసిన చేనేత పథకాలన్నీ పునరుద్ధరిస్తాం
పెడన 23వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాగిత కృష్ణప్రసాద్‌

ఎన్నికల ప్రచారంలో కాగిత కృష్ణప్రసాద్‌ హామీ

పెడన, ఏప్రిల్‌ 26: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన చేనేత కార్మికుల సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరి స్తామని టీడీపీ-జనసేన-బీజేపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 23, 16 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షో భంలో కూరుకుపోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను ఆయన వివరించారు. యక్కల శ్యామలయ్య, సాదరబోయిన ఏడుకొండలు, వహబ్‌ఖాన్‌, బెజవాడ నాగరాజు, పరసా సూర్యనారాయణ, కమ్మగంటి బాబు, ఎలిగట్ల ప్రసాద్‌, పరసా జితేంద్ర, భట్ట శంకరరావు, సేనాపతి అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:46 AM