అభివృద్ధిలో వెనుకబడ్డాం
ABN , Publish Date - Jan 30 , 2024 | 01:36 AM
రాష్ట్ర ప్రభుత్వం సం క్షేమ పథకాలను బాగానే అమలు చేస్తోందని, కానీ, అభివృద్ధిలో వెనుకబడ్డామని వైసీపీ ఎ.కొండూరు జడ్పీటీసీ సభ్యుడు భూక్యా గన్యా అన్నారు.
![అభివృద్ధిలో వెనుకబడ్డాం](https://media.andhrajyothy.com/media/2023/20231205/29akr01_72cf85977c.jpg)
వైసీపీ ఎ.కొండూరు జడ్పీటీసీ సభ్యుడు గన్యా వ్యాఖ్యలు
ఎ.కొండూరు, జనవరి 29: రాష్ట్ర ప్రభుత్వం సం క్షేమ పథకాలను బాగానే అమలు చేస్తోందని, కానీ, అభివృద్ధిలో వెనుకబడ్డామని వైసీపీ ఎ.కొండూరు జడ్పీటీసీ సభ్యుడు భూక్యా గన్యా అన్నారు. సోమవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో గన్యా మాట్లాడారు. కొందరు ప్రజా ప్రతి నిధులు గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సీఎం జగన్ ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఎంపీడీవో రవికాంత్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీలు సిద్ధం పద్మ, శివారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.