మాకు ఓట్లు... మీకు తాయిలాలు
ABN , Publish Date - Feb 29 , 2024 | 01:07 AM
పెనమలూరు వైసీపీ ఇన్చార్జి, మంత్రి జోగి రమేష్ తాయిలాల పంపిణీ కొనసాగుతోంది. పది రోజుల క్రితం పెనమలూరులో పాస్టర్లకు కుక్కర్లు, డబ్బులు పంపిణీ చేశారు.
![మాకు ఓట్లు... మీకు తాయిలాలు](https://media.andhrajyothy.com/media/2024/20240227/gifts_2ca567a09b.jpg)
కానూరులో డ్వాక్రా గ్రూపుల యానిమేటర్లకు
మంత్రి జోగి రమేష్ అనుచరుల చీరలు, కుక్కర్ల పంపిణీ
పెనమలూరు, ఫిబ్రవరి 28 : పెనమలూరు వైసీపీ ఇన్చార్జి, మంత్రి జోగి రమేష్ తాయిలాల పంపిణీ కొనసాగుతోంది. పది రోజుల క్రితం పెనమలూరులో పాస్టర్లకు కుక్కర్లు, డబ్బులు పంపిణీ చేశారు. వారం కిందట కానూరు మన కల్యాణ మండపంలో వలంటీర్లకు విలువైన ఫ్లాస్కులు, హాట్బాక్సులు ఇచ్చారు. బుధవారం అదే కల్యాణ మండపంలో కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాలకు చెందిన 190 మంది డ్వాక్రా గ్రూపుల యానిమేటర్లకు విలువైన చీరలు, కుక్కర్లను మంత్రి అనుచరులు అందజేశారు.