Share News

టీడీపీ, జనసేన శ్రేణుల విజయోత్సవాలు

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:31 AM

ఎన్నికల్లో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి భారీ విజయం పొందడంపై అవనిగడ్డ మండలంలో టీడీపీ, జనసేన పార్టీల నేతలు సంబరాలు జరిపారు.

టీడీపీ, జనసేన శ్రేణుల విజయోత్సవాలు
అవనిగడ్డలో చంద్రబాబు, పవన్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న నేతలు

అవనిగడ్డ, జూన్‌ 5: ఎన్నికల్లో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి భారీ విజయం పొందడంపై అవనిగడ్డ మండలంలో టీడీపీ, జనసేన పార్టీల నేతలు సంబరాలు జరిపారు. పార్టీ అవనిగడ్డ మండల కార్యాలయంలో యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. అవని గడ్డ ప్రసన్నాంజనేయస్వామి దేవాయలంలో 116 కొబ్బరి కాయలు కొట్టారు. లంకమ్మ ఆలయంలోనూ బడే సుబ్బా రావు నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. అవనిగడ్డ వంతెన సెంటర్‌లో టీడీపీ, జనసేన నేతలు కేక్‌ కట్‌చేసి సంబరాలు జరిపారు.

బుద్ధప్రసాద్‌కు శుభాకాంక్షల వెల్లువ

నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మండలి బుద్ధప్రసా ద్‌ను పలువురు ముఖ్య నేతలు మంగళ, బుధవారాల్లో కలసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నేతలు యాసం చిట్టిబాబు, కొల్లూరి వెంకటేశ్వరరావు, బండే రాఘవ, బండే నాగవెంకట కనకదుర్గ, యలవర్తి చిన్నా, బచ్చు రఘునాథ్‌, పులిగడ్డ నాంచారయ్య, బండే శ్రీనివాసరావు, మండవ బాలవర్ధిరావు, తలశిల వెంకట నరసింహారావు, స్వర్ణలత, మెండు లక్ష్మణరావు, ఉప్పల ప్రసాద్‌, మెడ బలిమి మల్లికార్జునరావు, రావి నాగేశ్వరరావు, నడకుదుటి జనార్దనరావు, రావి రత్నగిరి, చందన రంగారావు, పోలి మేట్ల ఏసుబాబు, మోర్ల రాంబాబు, పైడిపాముల కృష్ణకు మారి, యార్లగడ్డ శ్రీనివాసరావు, నిడమానూరి దిలీప్‌ కుమార్‌, ముమ్మనేని నాని, తుమ్మల చౌదరిబాబు, పరు చూరి సుభాష్‌ చంద్రబోస్‌, గుత్తికొండ వరప్రసాద్‌, తాడి కొండ వెంకటేశ్వరరావు, జనసేన నేతలు రాయపూడి వేణుగోపాలరావు, మత్తి వెంకటేశ్వరరావు, బాసు నాంచా రయ్యనాయుడు, గుడివాక శేషుబాబు, మర్రే గంగయ్య, పూషడపు రత్నగోపాల్‌, బండ్రెడ్డి హరి, పద్యాల వెంకట ప్రసాద్‌, బండ్రెడ్డి మల్లికార్జునరావు, కోన రాజశేఖర్‌లు బుద్ధప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు, పవన్‌ ఫ్లెక్సీలకు పాలాభిషేకం

అవనిగడ్డ: కూటమి అధికారంలోకి వచ్చి, మండలి బుద్ధప్రసాద్‌ భారీ మెజారిటీతో గెలుపొందిన సంద ర్భంగా ప్రధాన సెంటర్‌లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీ ఫొటోలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాలాభిషేకం చేసి కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచి పెట్టారు.

అరిసేపల్లిలో..

మచిలీపట్నం టౌన్‌: కూటమి భారీ మెజారిటీతో గెలవడంతో బందరు మండలం అరిసేపల్లి పంచాయతీ చిట్టిపాలెం గ్రామంలో టీడీపీ అధ్యక్షుడు అమ్మిరెడ్డి శివ య్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, నరేంద్ర మోదీ, కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరి చిత్రపటా లకు పాలాభిషేకం చేశారు. గోపు సత్యనారాయణ, కాగిత వెంకటేశ్వరరావు, లంకే నారాయణప్రసాద్‌, కుంచే నాని, తలారి సోమశేఖర్‌, లంకే శేషగిరిరావు, సత్యనారాయణ, పాండురంగారావు, ఉపేంద్ర పాల్గొన్నారు.

లింగవరంలో..

గుడివాడ రూరల్‌: వెనిగండ్ల రాము అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా లింగవరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకు న్నారు. బాణాసంచా కాల్చారు. చిరంజీవి రెడ్డి, గోపాల స్వామి, శ్రీనివాసరెడ్డి, కాటూరి ఏసుపాదం పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 01:31 AM