Share News

వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

ABN , Publish Date - May 23 , 2024 | 12:27 AM

మండలంలోని లంకపల్లి అగ్రహారంలో కొలువైవున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి సందర్భంగా స్వామి వారి కల్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు చదలవాడ కుమారస్వామి, అర్చకులు శివనాగేశ్వరరావు ప్రసాద్‌ శర్మల నేతృత్వంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

 వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
లంకపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ వేడుకలో భక్తులు

ఉంగుటూరు, మే 22 : మండలంలోని లంకపల్లి అగ్రహారంలో కొలువైవున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి సందర్భంగా స్వామి వారి కల్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు చదలవాడ కుమారస్వామి, అర్చకులు శివనాగేశ్వరరావు ప్రసాద్‌ శర్మల నేతృత్వంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సహిత శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఆశీనులు చేయించి వేదమంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణల నడుమ వేదపండితులు పరాశరం రామకృష్ణమాచార్య పాకయాజి ఆధ్వర్యంలో ఆయన శిష్యబృందం స్వామివార్ల కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా, కన్నుల పండువగా జరిపిం చారు. కల్యాణోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు గడ్డం వీరాస్వామి, అన్నం జ్వాలా నాగేశ్వరరావు, గ్రామపెద్దలు పోపూరి పూర్ణచంద్రరావు, జగదీష్‌, చింతా రమేష్‌, పాలడుగు గోపాలకృష్ణ, మాచినేని వెంకటేశ్వరరావు, వేమినీడు శ్రీనివాసరావు, జాలాది శ్రీనివాసరావు, పాలడుగు నేహ్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 12:27 AM