Share News

షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులపై అవగాహన

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:36 AM

అవగాహనతో పెట్టుబ డులు పెడితే లాభాలు గడించవచ్చునని సెక్యూరి టీస్‌ మార్కెట్‌ ట్రైనర్‌ డాక్టర్‌ ఓలేటి అచ్యుత రామ కిషోర్‌ అన్నారు.

షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులపై అవగాహన

షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులపై అవగాహన

వన్‌టౌన్‌, మార్చి 11: అవగాహనతో పెట్టుబ డులు పెడితే లాభాలు గడించవచ్చునని సెక్యూరి టీస్‌ మార్కెట్‌ ట్రైనర్‌ డాక్టర్‌ ఓలేటి అచ్యుత రామ కిషోర్‌ అన్నారు. కేబీఎన్‌ కాలేజీలో సోమవారం కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో పెట్టుబడులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ షేర్‌ మార్కెట్‌ను అవగాహన చేసుకుని పెట్టుబడులు పెట్టిన వాళ్లు మంచి లాభాలు గడిస్తారన్నారు. అవగాహన లేక పెట్టుబడులు పెడితే మాత్రం నష్టాలను చవి చూడాల్సి ఉంటుందన్నారు. సెబీ వంటి సంస్థలు సదుపాయాలు, భద్రతాంశాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ వి.నారాయణరావు, విభాగాధిపతి హేమంత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:36 AM