Share News

రెండు బైక్‌లు ఢీ.. వృద్ధుడి దుర్మరణం

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:12 AM

గనిఆత్కూరు గ్రామానికి చెందిన షేక్‌ జాని(64) ద్విచక్రవాహనంపై కంచికచర్ల వైపు వస్తుండగా కంచికచర్ల నుంచి పరిటాల వైపు వెళుతున్న మోటార్‌ బైక్‌ ఢీ కొట్టింది.

రెండు బైక్‌లు ఢీ.. వృద్ధుడి దుర్మరణం

మరొకరికి తీవ్ర గాయాలు

కంచికచర్ల రూరల్‌, ఫిబ్రవరి 19: గనిఆత్కూరు గ్రామానికి చెందిన షేక్‌ జాని(64) ద్విచక్రవాహనంపై కంచికచర్ల వైపు వస్తుండగా కంచికచర్ల నుంచి పరిటాల వైపు వెళుతున్న మోటార్‌ బైక్‌ ఢీ కొట్టింది. ఈప్రమాదం సోమవారం జాతీయ రహదారిపై ఓసీ క్లబ్‌ సమీపంలో జరిగింది. జానీ అక్కడికక్కడే మృతి చెందగా, మోటార్‌ బైక్‌పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసంనందిగామ ప్రభుత్వాస్పత్రికి పంపా మని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు.

Updated Date - Feb 20 , 2024 | 01:12 AM