Share News

మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారు

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:50 AM

ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ఆట మొదలు పెట్టి సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారు

జగన్‌పై వసంత నాగేశ్వరరావు ఆగ్రహం

వీరులపాడు, ఫిబ్రవరి 28: ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ఆట మొదలు పెట్టి సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెల్లంకి గ్రామంలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఐటీ సెక్టార్‌ కారణంగా ఎంతోమంది యువతకు విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చిందన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయి యువ తకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పయనమయ్యా రన్నారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్న జగన్‌ నిధులు మాత్రం విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజలకు మౌలిక వస తుల కల్పన లేదని ఆయన విమర్శించారు.

Updated Date - Feb 29 , 2024 | 12:50 AM