కాపురానికి రాలేదని గొంతు కోసుకున్న భర్త
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:42 AM
భార్య కాపురానికి రావడంలేదని భర్త మనస్థాపంతో చాకుతో గొంతు కోసుకు న్నాడు. ఈ ఘటన మం డలంలోని అట్లప్రగడ గ్రామంలో జరిగింది.
![కాపురానికి రాలేదని గొంతు కోసుకున్న భర్త](https://media.andhrajyothy.com/media/2024/20240215/16akr01_9a079f19e0.jpg)
108లో ఆస్పత్రికి తరలింపు
ఎ.కొండూరు, ఫిబ్రవరి 16: భార్య కాపురానికి రావడంలేదని భర్త మనస్థాపంతో చాకుతో గొంతు కోసుకు న్నాడు. ఈ ఘటన మం డలంలోని అట్లప్రగడ గ్రామంలో జరిగింది. పెనుగంచిప్రోలు మండలం గట్టు భీమవ రానికి చెందిన అల్లూరి శ్రీనివాస్కు ఎ.కొండూరు మండలం అట్లప్రగడ గ్రామానికి చెందిన గొల్లపూడి కృష్ణవేణికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక పాప ఉంది. ఇటీవల భార్య భర్తల మధ్య ఘర్షణ జరిగి కృష్ణవేణి తన పుట్టింటికి వచ్చింది. శుక్ర వారం శ్రీనివాస్ తన కుమారైను చూడడా నికి అట్టప్రగడకు వచ్చాడు. ఫుల్లుగా మద్యం తాగి పెద్ద పెద్ద కేకలు వేస్తూ తలను రోడ్డుకు, హ్యాండ్ పంపునకు కొట్టుకుంటూ తన వెంట తెచుకొన్న చాకుతో గొంతు కోసుకున్నాడు. గ్రామస్థులు 108లో తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు రానందున కేసు నమోదు చేయలేదని ఏఎస్సై లక్ష్మి తెలిపారు.