Share News

బోరు గుంతలో పడిన బాలిక

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:15 AM

డ్రెయినేజీ నిర్మాణానికి తీసిన బోరు గుంతలో పడిన పదేళ్ల దివ్యాంగ బాలికను సమాంతరంగా మరో గుంత తవ్వి రక్షించిన సంఘటన శనివారం పెనుమత్సలో జరిగింది.

బోరు గుంతలో పడిన బాలిక
పెనుమత్సలో బోరు గుంతలో పడిన కొడాలి సింధూషాను రక్షించేందుకు పక్కన సమాంతరంగా గుంత తవ్వుతున్న స్థానికులు

సమాంతరంగా గుంతతవ్వి రక్షించిన స్థానికులు

పమిడిముక్కల, జనవరి 27: డ్రెయినేజీ నిర్మాణానికి తీసిన బోరు గుంతలో పడిన పదేళ్ల దివ్యాంగ బాలికను సమాంతరంగా మరో గుంత తవ్వి రక్షించిన సంఘటన శనివారం పెనుమత్సలో జరిగింది. వివరాల లోకి వెళితే డ్రెయినేజీలో పిల్లర్లు వేసేందుకు ఓ ఇంటి వద్ద తవ్విన పది అడుగుల బోరు వద్దకు వెళ్లిన కొడాలి సింధూష ప్రమాదవశాత్తు కాలు జారి గుంతలో పడిపోయింది. గమనించిన స్థానికులు కేకలు వేశారు. దీంతో అక్కడకు చేరుకున్న ఇరుగుపొరుగువారు బాలికను బయటకు తీసేందుకు తువ్వాళ్లు ముడులు వేసి గుంతలోకి జారవిడిచారు. దివ్యాంగు రాలైన బాలిక వాటిని పట్టుకోలేక పోయింది. గుంతకు సమాంతరంగా జేసీబీతో గుంతతవ్వి ఆమె చేతులకు తువ్వాళ్లు ముడివేసి బయటకు లాగారు. బాలికను అంబులెన్స్‌లో మచిలీపట్నం వైద్యశాలకు తరలిం చగా ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు సమాచారం. పమిడిముక్కల ఏఎస్‌ఐ ఆనందరావు, సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 01:15 AM