Share News

టీడీపీ పాలనలోనే ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:40 AM

రాష్ట్రాభి వృద్ధి, ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదరి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

టీడీపీ పాలనలోనే ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ
గొల్లపూడిలో కరపత్రాలు అందిస్తున్న దేవినేని ఉమా

గొల్లపూడి / మైలవరం, జనవరి 4: రాష్ట్రాభి వృద్ధి, ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదరి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలో, జక్కంపూడి కాలనీల్లో గురువారం బాబు ష్యూరిటీ - భవిష్యత్‌ గ్యారెంటీ నిర్వహించారు. ఈసందర్భంగా ఉమా మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజలకు బంగారు భవిష్యత్‌ను అందిస్తాయన్నారు. కార్యక్రమంలో దారు నాయక్‌, నేతలు నర్రా వాసు, రంగినేని నరేంద్ర, షేక్‌ కరిముల్లా, వడ్లమూడి చలపతిరావు, నూతలపాటి వెంకటేశ్వరరావు (నారద), కొమ్మినేని రామారావు, గూడపాటి పద్మశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మైలవరంలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ నమోదు 2 వేల కుటుంబాల మార్కు దాటిందని తెలుగు యువత మైలవరం నియోజకవర్గ అధ్యక్షుడు లంక లితీష్‌ అన్నారు. గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు.

టీడీపీకి ప్రజాదరణ.. జగన్‌కు వణుకు : ఆనందబాబు

విస్సన్నపేట: టీడీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి జగన్‌కు వెన్నులో వణుకు పుట్టుకొస్తుందని మాజీమంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. విస్సన్నపేటలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 7న తిరువూరులో జరగనున్న రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేత కేశినేని శివనాథ్‌ (చిన్ని), నియోజకవర్గ ఇన్‌చార్జి శావల దేవదత్‌, చెన్నుపాటి గాంధీ, పరిశీలకుడు చిట్టిబాబు, నెక్కళపు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, మట్టా వేణుగోపాల్‌, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:40 AM