కారుకు మోటార్ సైకిల్ అడ్డు తీయలేదని రాళ్లతో కొట్టి వ్యక్తి హత్య
ABN , Publish Date - Jan 09 , 2024 | 12:38 AM
నగర శివారు పాయకాపురంలో దారుణం చోటు చేసుకుంది. కేవలం కారుకు మోటార్ సైకిల్ అడ్డువచ్చిందని ఇద్దరు యువకులు మరో వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. రాళ్లతో తలపై కొట్టి అవుట్ఫాల్ డ్రెయిన్లోకి నెట్టివేశారు.
![కారుకు మోటార్ సైకిల్ అడ్డు తీయలేదని రాళ్లతో కొట్టి వ్యక్తి హత్య](https://media.andhrajyothy.com/media/2023/20231205/8_payakapuram_02_3a9d7653b9.jpg)
పాయకాపురం, జనవరి 8 : నగర శివారు పాయకాపురంలో దారుణం చోటు చేసుకుంది. కేవలం కారుకు మోటార్ సైకిల్ అడ్డువచ్చిందని ఇద్దరు యువకులు మరో వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. రాళ్లతో తలపై కొట్టి అవుట్ఫాల్ డ్రెయిన్లోకి నెట్టివేశారు. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేలుకుట్ల మాలకొండయ్య (41) స్థానిక ఎల్బీఎ్సనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ముఠా కార్మికుడైన మాలకొండయ్య ఆదివారం రాత్రి స్నేహితులు వెంకటేశ్వరరావు, రామయ్యలతో కలిసి పైపుల రోడ్డు నుంచి ఎల్బీఎ్సనగర్ వైపు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. లక్ష్మీనగర్ ప్రాంతానికి రాగానే వీరి వాహనానికి ట్రావెల్ బస్సు అడ్డు వచ్చింది. బస్సు మలుపు తిరుగుతుండటంతో మోటార్ సైకిల్ను ఆపారు. అంతలో వెనుక నుంచి వచ్చిన కారులో వచ్చినవారు హారన్ మోగించడంతో వెళ్లేందుకు దారి లేదు కదా అని సమాధానం చెప్పారు. దాంతో కారులో ఉన్న వరుసకు తోడల్లుళ్లయిన కంచర్ల సాయి(28), ఆత్మకూరి రామరాజు(27)లు వారితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాలు తోపులాటకు దిగటంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన సాయి, రామరాజు మోటార్ సైకిల్పై ఉన్న మాలకొండయ్య, వెంకటేశ్వరరావులపై దాడికి దిగారు. దాడిలో వెంకటేశ్వరరావు పక్కకు పడిపోగా మాలకొండయ్య తలపై నాపరాయితో దాడిచేశారు. కాళ్లతో విచక్షణా రహితంగా తన్ని పక్కనే ఉన్న అవుట్ఫాల్ డ్రెయిన్లోకి తోసేసి కారులో వెళ్లిపోయారు. స్థానికులు, బాధితుల బంఽధువులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇరువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాలకొండయ్య సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో బంధువులు పెద్ద ఎత్తున స్టేషన్కు చేరుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేయడంతో వారు శాంతించారు. కంచర్ల సాయి, ఆత్మకూరిరామరాజులపై 302, 323 సెక్షన్లకింద పోలీసులు కేసు నమోదు చేశారు.