10 నామినేషన్లు తిరస్కరణ
ABN , Publish Date - Apr 27 , 2024 | 12:34 AM
గన్నవరం ఆర్వో కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ల స్ర్కూట్నీలు జరిగాయి. మొత్తం 34 నామినేషన్లు వేశారు. 10 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. 14మంది పోటీలో ఉంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గీతాంజలిశర్మ తెలిపారు.
గన్నవరం, ఏప్రిల్ 26 : గన్నవరం ఆర్వో కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ల స్ర్కూట్నీలు జరిగాయి. మొత్తం 34 నామినేషన్లు వేశారు. 10 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. 14మంది పోటీలో ఉంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గీతాంజలిశర్మ తెలిపారు. సీపీఎం అభ్యర్ధిగా కళ్లం వెంకటేశ్వరావు, టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, వైసీపీ నుంచి వల్లభనేని వంశీమోహన్, బహుజన సమాజ్ పార్టీ నుంచి సింహాద్రి రాఘ వేంద్రరావు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పైలా అజయ్, తెలుగు రాజాధికార సమితి పార్టీ నుంచి తాడంకి జగదీష్ రామచంద్రరావు, ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి దొండపాటి ఆనంద్ ప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథావాలే) నుంచి పొట్లూరి రవీంద్రకుమార్, స్వాతంత్య్ర అభ్యర్థులుగా ప్రత్తిపాటి అరుణకుమారి, కొర్రాపోలు శ్రీనివాసరావు, గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, పొట్లూరి శ్రీదేవి, వల్లభనేని మోహన్ వంశీ కృష్ణ, సర్నాల విజయదుర్గలను ప్రకటించారు.