Share News

టీడీపీతోనే బీసీల అభ్యున్నతి

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:30 AM

టీడీపీతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని టీడీపీ పెడన ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. గూడూరు మండలం శారదాయిపేటలో మండలస్థాయి బీసీ జయహో కార్యక్రమం నిర్వహించారు. కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ బీసీలకు పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారి అభ్యు న్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు.

 టీడీపీతోనే బీసీల అభ్యున్నతి
సభలో మాట్లాడుతున్న కాగిత కృష్ణప్రసాద్‌

పెడన రూరల్‌ : టీడీపీతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని టీడీపీ పెడన ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. గూడూరు మండలం శారదాయిపేటలో మండలస్థాయి బీసీ జయహో కార్యక్రమం నిర్వహించారు. కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ బీసీలకు పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారి అభ్యు న్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు(బుల్లయ్య) మాట్లాడుతూ, వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, జనరంజకమైన పాలనకోసం ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ పరిశీలకులు సాదరబోయిన ఏడుకొండలు, పోతన స్వామి, పరసా సూర్యనారాయణ, కాసగాని శ్రీనివాసరావు, మునేశ్వరరావు, గోపి నాగబాబు, చింతలమ్మ, వాకా శ్రీనివాసరావు, బొర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నాగాయలంక : కమ్మనమోలులో శనివారం బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే టీడీపీని గెలిపించాలని భావదే వరపల్లి సర్పంచ్‌, టీడీపీ నేత మండలి ఉదయభాస్కర్‌ ప్రజలను కోరారు. ఇంటింటికి తిరిగి గ్రామస్థులకు కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కూరాకుల నాంచారయ్య, నాగులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 01:30 AM