టీడీపీ పాలనలో అందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Jan 09 , 2024 | 12:57 AM
టీడీపీ పాలనలోనే అందరికీ సంక్షేమ పథకాలతో పాటు పండగలకు కానుకలను అందజేశారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలో సోమవారం సంక్రాంతి కానుకగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంక ట్రావు పంపిన చీరలను టౌన్ అధ్యక్షులు జాస్తి శ్రీధర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
![టీడీపీ పాలనలో అందరికీ సంక్షేమ పథకాలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/8gvrm7_0ba4d65570.jpg)
గన్నవరం, జనవరి 8 : టీడీపీ పాలనలోనే అందరికీ సంక్షేమ పథకాలతో పాటు పండగలకు కానుకలను అందజేశారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలో సోమవారం సంక్రాంతి కానుకగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంక ట్రావు పంపిన చీరలను టౌన్ అధ్యక్షులు జాస్తి శ్రీధర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కొమ్మరాజు సుధీర్, మద్దినేని వెంకటేశ్వరరావు, పడమట రంగారావు, కాసన్నేని రంగబాబు, జాస్తి ఫణిశేఖర్, తుల్లిమిల్లి ఝాన్సీలక్ష్మీ, బుస్సే సరితాదేవి, చిమట శ్రీనివాసరావు, నాగబాబు, నర్రా లక్ష్మణరావు, బుస్సే నాగ ప్రసాద్, మోదుగుమూడి రాజేశ్వరి, అరిఫ్ఖాన్, ఆసిఫ్ఖాన్, ఆళ్ల శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్జంక్షన్ : గన్నవరం టీడీపీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు మహిళలకు అందించిన సంక్రాంతి కానులను సోమవారం బాపులపాడులో టీడీపీ నేతలు పంపిణీ చేశారు. టీడీపీ హనుమాన్ జంక్షన్ పట్టణ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఐటీఐ, వేలేరు రోడ్డులో ఇంటింటికి వెళ్లి చీరలు, క్యాలెండర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గార్లపాటి రాజేశ్వరరావు, వీరమాచనేని బుజ్జి, ఆళ్ల సురేష్, ఫణి పాల్గొన్నారు.