సైకో పాలనతో జనం విసిగిపోయారు
ABN , Publish Date - Apr 25 , 2024 | 01:11 AM
ఐదేళ్ల సైకో జగన్ పాలనతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వైపు చూస్తున్నారని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ వ్యాఖ్యానించారు. బుధవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో తాడిగడపకు చెందిన వంద వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా బ్రష్టు పట్టించిన జగన్రెడ్డి తన కుటుంబంలోనే నెగ్గలేక, చెల్లెళ్లు అడిగే ప్రశ్నలకు బదులివ్వలేక నీళ్లు నములుతున్నాడని ఎద్దేవా చేశారు.
పెనమలూరు, ఏప్రిల్ 24 : ఐదేళ్ల సైకో జగన్ పాలనతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వైపు చూస్తున్నారని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ వ్యాఖ్యానించారు. బుధవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో తాడిగడపకు చెందిన వంద వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా బ్రష్టు పట్టించిన జగన్రెడ్డి తన కుటుంబంలోనే నెగ్గలేక, చెల్లెళ్లు అడిగే ప్రశ్నలకు బదులివ్వలేక నీళ్లు నములుతున్నాడని ఎద్దేవా చేశారు. పార్టీలో చేరిన వారందరికీ టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ నాయకులు విశ్వ, నర్రా చంటి, తుమ్మల రాంకుమార్ల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనుమోలు ప్రభాకరరావు, యార్లగడ్డ సుచిత్ర, పీతా గోపీచంద్, బర్మా శ్రీనివాస్, మేడసాని రత్నకుమారి, మల్లంపాటి విజయలక్ష్మి, మన్నె నాగలక్ష్మి, మేడసాని కృష్ణప్రసాద్, మేడసాని సూరిబాబు, పోలవరపు వెంకటరత్నం, పీతా గోపీచంద్ తదతరులు ఉన్నారు.
కానూరులో..
కానూరు తిరుపతమ్మ గుడి వద్ద నుంచి మంగళవారం జరిగిన పాదయాత్రలో స్థానిక నాయకులతో కలిసి బోడె ప్రసాద్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. దారిపొడవునా మహిళలు బోడెకు హారతులిచ్చి ఆశీర్వదించారు. ఆయన వెంట యార్లగడ్డ సుచిత్ర, అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకరబాబు, ముప్పా రాజా, షేక్ బుజ్జి, టీడీపీ రెహమాన్, దోనేపూడి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.