కుమారుడు సహా తల్లి ఆత్మహత్య
ABN , Publish Date - Feb 25 , 2024 | 01:29 AM
కుటుంబ కలహాలతో ఒక మహిళ కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో జరిగింది.
![కుమారుడు సహా తల్లి ఆత్మహత్య](https://media.andhrajyothy.com/media/2024/20240224/24vat2_jpeg_d5f4e16db7.jpg)
కుటుంబ కలహాల కారణంగానే..
వత్సవాయి, ఫిబ్రవరి 24 : కుటుంబ కలహాలతో ఒక మహిళ కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఫాతిమా (30)కు సూర్యాపేట జిల్లా రామాపురం గ్రామానికి చెందిన నాగుల్మీరాతో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తల మద్య వివాదం కారణంగా ఫాతిమా పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీ వల పెద్దలు రాజీ చేసి ఫాతిమాను కాపురానికి పంపాలనుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం చిన్న కుమారుడిని (3) తీసుకుని బయటకు వెళ్లిన ఫాతిమా ఎంతకీ ఇంటికి రాక పోవటంతో తల్లిదండ్రులు గ్రామంలో విచారణ చేశారు. వ్యవసాయ బావిలో వారిద్దరు శవాలై కనిపించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వత్సవాయి ఎస్సై అభిమన్యు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.