దుర్గగుడిలో అంతర్గత బదిలీలు నిలుపుదల
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:12 AM
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అంతర్గత బదిలీలను నిలుపుదల చేశారు. ఈ బదిలీల్లో చోటుచేసుకున్న అవకతవకలను వెలికితీస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే.

వన్టౌన్, జూలై 27 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అంతర్గత బదిలీలను నిలుపుదల చేశారు. ఈ బదిలీల్లో చోటుచేసుకున్న అవకతవకలను వెలికితీస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. వీటిపై సీఎంవో కార్యాలయ అధికారులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనాచౌదరి స్పందించారు. సీఎంవో కార్యాలయ అధికారులు ఎమ్మెల్యే సుజనాచౌదరితో ఫోన్లో మాట్లాడారు. దేవదాయ కమిషనర్ సత్యనారాయణ కూడా స్పందించి ఈవోతో మాట్లాడారు. బదిలీలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. దీంతో బదిలీలను తాత్కాలికంగా నిలిపివేశారు.
మా డబ్బు సంగతేంటి..?
ప్రాధాన్యత కలిగిన సీట్లకు తమను పంపాలని కొందరు ఉద్యోగులు ఇప్పటికే కొంత అడ్వాన్సులు చెల్లించారు. బదిలీ ఉత్తర్వులు రద్దు కావడంతో అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బు మాటేమిటంటూ మధ్యవర్తిగా ఉన్నవారి వెంటపడుతున్నారు. మీ పోస్టులు మీకే వస్తాయంటూ మధ ్యవర్తి ఇంకా సర్దిచెబుతుండటం గమనార్హం.