Share News

వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి : యార్లగడ్డ

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:53 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి, పారిశ్రామిక రంగం పూర్తిగా నష్టపోయిందని, రాష్ర్టాన్ని పునఃనిర్మించి, అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఒక ప్రకటలో పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి : యార్లగడ్డ

వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి : యార్లగడ్డ

గన్నవరం, ఫిబ్రవరి 29: వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి, పారిశ్రామిక రంగం పూర్తిగా నష్టపోయిందని, రాష్ర్టాన్ని పునఃనిర్మించి, అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం జెండా సభ సూపర్‌ హిట్‌తో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చిన వైసీపీ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం రూ.5 అన్న క్యాంటీన్‌ ద్వారా పేదలకు భోజనం పెడితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల కడుపు కొట్టిందన్నారు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు యార్లగడ్డ పిలుపునిచ్చారు.

Updated Date - Mar 01 , 2024 | 12:53 AM