Share News

ఎన్నికల నిబంధనలకు లోబడి శ్రీవారి కల్యాణం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:50 AM

ఎన్నికల నిబంధనల మేర వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించాలని ఏసీపీ రవికిరణ్‌ అన్నారు.

ఎన్నికల నిబంధనలకు లోబడి శ్రీవారి కల్యాణం
సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ రవికిరణ్‌

జగ్గయ్యపేట రూరల్‌, ఏప్రిల్‌ 18: ఎన్నికల నిబంధనల మేర వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించాలని ఏసీపీ రవికిరణ్‌ అన్నారు. తిరుమలగిరి వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ కల్యాణానికి ఆలయ అధికారులు సూచించిన మేరకు భక్తులు కార్యక్రమంలో పాల్గొనవచ్చని, మిగిలినవి నిబంధనల మేరకు నడుస్తాయన్నారు. ఏసీ సాంబశివరావు మాట్లాడుతూ కల్యాణానికి పాసులు ఇవ్వ టం లేదన్నారు. ప్రత్యేకంగా కల్యాణం టికెట్‌లు తీసుకున్న వారికే మండపం పైకి అనుమతిస్తామన్నారు. భక్తులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు. సమావేశంలో సతీష్‌, ఆలయ ప్రధానార్చకుడు తిరునగరి రామకృష్ణమాచార్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:50 AM