అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:41 AM
తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
జగ్గయ్యపేట రూరల్, ఏప్రిల్ 24: తిరుమలగిరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి పెళ్లికి ముందు నిర్వహించే ఎదురుకోలోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వమించారు. ఆలయ ఏసీ సాంబశివరావు పర్యవేక్షణలో పరాంకుశం వాసుదేవాచార్యులు యాగ్నీకంలో తిరునగరి రామకృష్ణమాచార్యులు బృందం వైఖానస ఆగమానుసారం కల్యాణాన్ని జరిపించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. డీసీపీ శ్రీనివాస్, డీసీ విజయరాజు కల్యాణోత్సవంలో పాల్గొనగా ఏసీపీ రవికిరణ్, ఎస్సై సతీష్ బందోబస్తు నిర్వహించారు.
గరుడాచలంలో....
పోచంపల్లి, బండిపాలెం గ్రామ శివారులోని గరుడాచల వీరనారసింహస్వామి కల్యాణం మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేదాంతం శ్రీధరాచార్యులు, మురళీధరాచార్యు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పాల్గొన్న వారికి వంశపారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో అననసమారాధన నిర్వహించారు.