Share News

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:54 PM

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని, చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ పాయకాపురం ప్రజాశక్తినగర్‌లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి.

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు

పాయకాపురం, జూన్‌ 3 : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని, చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ పాయకాపురం ప్రజాశక్తినగర్‌లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. జిల్లా నాయీ బ్రాహ్మణ సాధికార కన్వీ నర్‌ సూరవరపు నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని పూజలు నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిచి రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని సూరవరపు నాగరాజు కోరారు. శ్రీను, రాజేష్‌, సత్యనారాయణ, శ్రీకాంత్‌, హేమంత్‌, కొండ, పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 11:54 PM