Share News

మునిసిపల్‌ ఆప్కాస్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:51 AM

మునిసిపల్‌ ఆప్కాస్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశను మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్‌ కోరారు.

మునిసిపల్‌ ఆప్కాస్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
కలెక్టర్‌ లక్ష్మీశకు వినతి పత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకుడు కాశీనాథ్‌, తదితరులు

మునిసిపల్‌ ఆప్కాస్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

కలెక్టర్‌ లక్ష్మీశకు సీఐటీయూ నగర కమిటీ వినతి

వన్‌టౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఆప్కాస్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశను మునిసిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్‌ కోరారు. సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో దోనేపూడి కాశీనాథ్‌, పలువురు నాయకులు బుధవారం కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్‌ తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, మిగిలిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు ఎస్‌.జ్యోతిబసు, నాయకులు డి.స్టీఫిన్‌ బాబు, టి. ప్రవీణ్‌, జె.విజయలక్ష్మి, దుర్గారావు, కృష్ణ, పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:51 AM