రైతు సంక్షేమమే టీడీపీ లక్ష్యం
ABN , Publish Date - Jan 08 , 2024 | 01:33 AM
రైతు సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని గన్నవరం ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మడిచర్ల టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మడిచర్లలో యార్లగడ్డ వెంకట్రావుకు రైతులు ట్రాక్టర్ల ర్యాలీతో, నిమ్మకాయల గజమాలతో ఘనస్వాగతం పలికారు. గుర్రపుబండిపై యార్లగడ్డను ఉరేగించారు.
![రైతు సంక్షేమమే టీడీపీ లక్ష్యం](https://media.andhrajyothy.com/media/2023/20231205/7hjr01_aa84d49f49.jpg)
యార్లగడ్డ వెంకట్రావుకు నిమ్మకాయల గజమాలతో స్వాగతం పలుకుతున్న మడిచర్ల వాసులు
హనుమాన్జంక్షన్రూరల్, జనవరి 7 : రైతు సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని గన్నవరం ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మడిచర్ల టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మడిచర్లలో యార్లగడ్డ వెంకట్రావుకు రైతులు ట్రాక్టర్ల ర్యాలీతో, నిమ్మకాయల గజమాలతో ఘనస్వాగతం పలికారు. గుర్రపుబండిపై యార్లగడ్డను ఉరేగించారు. ప్రత్యేకం గా నిప్పులతో తయారు చేసిన వైవీఆర్ టీడీపీ శ్రేణు ల్లో జోష్ నింపింది. అర్ధరాత్రి వరకూ యార్లగడ్డ రాక కోసం గ్రామస్తులు వేచి చూచి హారతులతో స్వాగతం పలికారు. ఆయిల్పామ్, డ్రిప్ ఇరిగేషన్ లాంటి వాటిని ప్రోత్సహించే విధంగా టీడీపీ హయాంలో ఇచ్చిన ప్రోత్సాహకాలను ఇంతవరకూ ఇవ్వలేదని కొందరు రైతులు యార్లగడ్డ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పుట్టా సురేష్, భూక్యా రంగారావు, దేవినేని సత్య నారాయణ, మోటూరి శ్రీనివాస్, కూకటి దుర్గారావు, భూక్యా దావీదు, తానంకి ఇజ్రాయేలు, కాలి శ్రీధర్, తెనాలి జోజిబాబు, కాలి రాజేష్, గోపి, గొరిపర్తి నాగరాజు, కంపసాటి బాలయేసు పాల్గొన్నారు.
గండిగుంటలో..
గండిగుంట(ఉయ్యూరు) : రాష్ట్రంలో మహిళలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు మహిళాశక్తి, తల్లికి వందనం మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొంది స్తాయని పార్టీ అధికార ప్రతినిధి కొండా ప్రవీణ్ అన్నారు. గండిగుంటలో ఆదివారం పర్యటించి, బాబూ ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలు పంపిణీ చేశారు. నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు రత్నవేణి, సాయి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
పెనమలూరు : టీడీపీ అధినేత చంద్రబాబుకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని టీడీపీ నాయకులు శొంఠి శివరాంప్రసాద్, మొక్కపాటి శ్రీనివాస్, అనంతనేని ఆజాద్ పేర్కొన్నారు. ఆదివారం యనమలకుదురులో జరిగిన బాబుష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో వారు పాల్గొని స్థానికులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రకటించిన రాజమండ్రి మేనిఫెస్టోలో ఉన్న పథకాలను వివరించారు. వీరంకి కుటుంబరావు, ఇబ్రహీం, బలగం కొండ, ఆరేపల్లి వెంకటేశ్వరరావు, పండల రజిని, మల్లంపాటి విజయలక్ష్మి, సయ్యద్ షాహీనా, తుమ్మల రామకిషోర్, బూక్య రాజా, తాడిశెట్టి వీరాస్వామి, తమ్ము అశోక్, బలగం నాగరాజు, కళ్యాణపు శ్రీనివాస్, వెలగపూడి శేఖర్, మాచిన శివ, సీడీ ప్రసాద్, బాణావతి విజయ్ పాల్గొన్నారు.