21 మంది వలంటీర్ల రాజీనామా
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:40 AM
పెద ఓగిరాలకు చెందిన 21 మంది వలంటీర్లు గురువారం రాజీనామా చేశారు.
ఉయ్యూరు, ఏప్రిల్ 18: పెద ఓగిరాలకు చెందిన 21 మంది వలంటీర్లు గురువారం రాజీనామా చేశారు. గ్రామ సచివాలయ పరిధిలో 22 మంది వలం టీర్లకు 21 మంది రాజీనామా చేసి, పత్రాలు అందజేసినట్టు ఎంపీడీవో జి.లక్ష్మీ దేవి తెలిపారు. స్థానిక అధికారపార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా వలంటీర్లు రాజీనామా చేసినట్టు సమాచారం.