రాష్ట్రానికి చంద్రబాబు దిశానిర్దేశం
ABN , Publish Date - Mar 24 , 2024 | 12:47 AM
రాష్ట్రానికి దిశా నిర్దేశం చేయగల సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అని పలువురు నాయకులు అన్నారు. టీడీపీ., జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ను చంద్రబాబు ప్రకటించడంతో టీడీపీ బీసీ శ్రేణులు పోరంకి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
![రాష్ట్రానికి చంద్రబాబు దిశానిర్దేశం](https://media.andhrajyothy.com/media/2024/20240322/23_PNMLR_1_JPG_19eaf00b58.jpg)
పెనమలూరు, మార్చి 23 : రాష్ట్రానికి దిశా నిర్దేశం చేయగల సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అని పలువురు నాయకులు అన్నారు. టీడీపీ., జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ను చంద్రబాబు ప్రకటించడంతో టీడీపీ బీసీ శ్రేణులు పోరంకి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ, బోడె ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో గడపగడపకూ తిరిగి టీడీపీకి ఓటు వేసే విధంగా పనిచేస్తామని, గాడి తప్పిన రాష్ర్టా న్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు అవసరం రాష్ర్టానికి ఎంతో ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంగెపు రంగారావు, పీతా గోపీచంద్, శొంఠి శివరాంప్రసాద్, జంపాన శ్రీనివాసరావు, మాదు శోభన్, తాడిశెట్టి వీరాస్వామి, బెజవాడ వెంకటేష్, ఈడే అంజిబాబు, సుబ్బారావు, మాదు నాగరాజు, అంగిరేకుల మురళి, చాణక్య, సలీం, తమ్ము అశోక్, ఇబ్రహీం, బుర్రా వెంకట్, వణుకూరు విక్రమ్, కొణతం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
బోడెకు అత్యధిక మెజారిటీ ఖాయం
కంకిపాడు : పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మాజీ ఎంపీపీ దేవినేని రాజా అన్నారు. పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థిగా బోడె ప్రసాద్ పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించ టంతో ఆయనకు అభినందనల వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ, ఏనుగ జయప్రకాష్తో కలిసి శనివారం బోడె ప్రసా ద్ను కలిసి ఆయన అభినందించారు. ఈ సందర్భం గా దేవినేని రాజా మాట్లాడుతూ, పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోడె ప్రసా ద్ పేరును ప్రకటించటంతో వైసీపీ నాయకుల ఓటమి ఖాయమైందన్నారు. బోడె ప్రసాద్పై ప్రజల్లో నమ్మకం, సానుభూతి, అందుబాటులో ఉంటారన్న నమ్మక ముందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సలీం, కాపు సంఘం నాయకులు పచ్చిపాల రాజ, ఏనుగ పవన్, నాని పాల్గొన్నారు.
జనసేన ఆధ్వర్యంలో..
పెనమలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బోడె ప్రసాద్ను గెలుపించుకుంటామని జనసేన పార్టీ పెనమలూరు సమన్వయకర్త ముప్పా రాజా అన్నారు. పెనమలూరులో శనివారం బోడె ప్రసాద్ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ముప్పా రాజా మాట్లాడు తూ పెనమలూరు నియోజకవర్గంలో బోడె ప్రసాద్కు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుంకర శివ, బాయిన నాగరాజు, మేదండ్రావు సతీష్, నాగశ్రీ, సుంకర సురేష్, సుధీర్ పాల్గొన్నారు.
ఫ రాష్ట్రాభివృద్ధి జరగాలన్నా.. రాష్ట్రంలో చంద్రన్న పాలన రావాలన్నా ప్రతి ఒక్కరూ బోడె ప్రసాద్ను గెలిపించుకోవాలని సీహెచ్సీ మాజీ చైర్మన్ యలమంచిలి కిషోర్బాబు అన్నారు. స్థానిక విలేకరులతో శని వారం మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరముందన్నారు.