ఘనంగా రాజా వాసిరెడ్డి విగ్రహావిష్కరణ
ABN , Publish Date - Feb 15 , 2024 | 12:40 AM
పట్టణంలో పద్మావతి నగర్ సర్కిల్లో కేసీపీ సంస్థలు ఏర్పాటు చేసిన ముక్త్యాల జమీందార్, మాజీ ఎమ్మెల్యే రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ విగ్రహావిష్కరణ బుధవారం కేసీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఎండీ డాక్టర్ వీఎల్ ఇందిరాదత్, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, చైర్మన్ రంగాపురం రాఘవేంద్రలతో కలిసి ఆవిష్కరించారు.
![ఘనంగా రాజా వాసిరెడ్డి విగ్రహావిష్కరణ](https://media.andhrajyothy.com/media/2023/20231205/14jpt12_f09260de53.jpg)
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 14: పట్టణంలో పద్మావతి నగర్ సర్కిల్లో కేసీపీ సంస్థలు ఏర్పాటు చేసిన ముక్త్యాల జమీందార్, మాజీ ఎమ్మెల్యే రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ విగ్రహావిష్కరణ బుధవారం కేసీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఎండీ డాక్టర్ వీఎల్ ఇందిరాదత్, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, చైర్మన్ రంగాపురం రాఘవేంద్రలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్రితలో ఆయన చిరస్మరణీయుడని కీర్తించారు. రాజకీయవేత్తగా, ఆయుర్వేద వైద్య, సాహిత్య పోషకులుగా, బహుముఖ సేవలు అందించారని వ్యక్తలు అన్నారు. కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మాజీ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ పలువురు కేసీపీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.