పుస్తకాలు.. విద్యార్థులకు నేస్తాలు
ABN , Publish Date - May 22 , 2024 | 12:54 AM
పుస్తకాలు విద్యార్థులకు నేస్తాలని, పుస్తకపఠనంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాప కశక్తి పెరుగుతుందని మానికొండ, ఉంగుటూరు, ఆత్కూ రు, తేలప్రోలు గ్రంథాలయాధికారులు ఎల్.హరికృష్ణ, యు.చంద్రశేఖరరావు, బీవీ కృష్ణారావు, బి.శ్రీనివాసరావు అన్నారు.
![పుస్తకాలు.. విద్యార్థులకు నేస్తాలు](https://media.andhrajyothy.com/media/2024/20240511/qq_6f445bc4ce.jpg)
ఉంగుటూరు, మే 21 : పుస్తకాలు విద్యార్థులకు నేస్తాలని, పుస్తకపఠనంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాప కశక్తి పెరుగుతుందని మానికొండ, ఉంగుటూరు, ఆత్కూ రు, తేలప్రోలు గ్రంథాలయాధికారులు ఎల్.హరికృష్ణ, యు.చంద్రశేఖరరావు, బీవీ కృష్ణారావు, బి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయా గ్రంథాలయాల్లో విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన కల్పించారు.
ఉయ్యూరు : శాఖా గ్రంఽథాలయంలో మంగళవారం గణిత సూత్రాలు, లెక్కలు సులువుగా చేసే విధానంపై రిసో ర్స్పర్సన్ ఎస్ మహేశ్ విద్యార్థులకు తెలియజేశారు. గ్రంఽథాలయ అధికారి రమణి, సిబ్బంది పాల్గొన్నారు.
గన్నవరం : వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం ముస్తాబాద, గన్నవరం గ్రంథాలయాల్లో విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు ఆటల పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాల బాధ్యులు జ్యోతికుమారి, రాజు, దుర్గలక్ష్మి పాల్గొన్నారు.