Share News

టీడీపీతోనే నడుస్తా

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:27 AM

ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జరిగిన పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ గురువారం కేశినేని శివనాథ్‌( చిన్ని)తో కలిసి నారాలోకేశ్‌ను ఆయన నివాసంలో కలిశారు.

టీడీపీతోనే నడుస్తా
నారా లోకేశ్‌ను కలిసిన జలీల్‌ఖాన్‌, కేశినేని శివనాథ్‌

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 29 : ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జరిగిన పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ గురువారం కేశినేని శివనాథ్‌( చిన్ని)తో కలిసి నారాలోకేశ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ, జలీల్‌ఖాన్‌ భవిష్యత్తు పూచీ తనదని తెలిపారు. జలీల్‌ఖాన్‌ మాట్లాడుతూ, టీడీపీలోనే కొనసాగుతానని, రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనార్టీల మద్దతు కూడగడతానని, లోకేశ్‌కు తెలిపారు. వైసీపీ నేతలను కలవడం యాదృశ్చికమే అన్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. టిక్కెట్‌ ఇస్తే 30వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Mar 01 , 2024 | 12:27 AM