త్వరలో సైకో పాలన అంతం
ABN , Publish Date - Jan 01 , 2024 | 12:48 AM
‘‘రాష్ట్రంలో త్వరలో సైకోపాలన అంతమవు తుంది. రామరాజ్యం రాబోతోంది. ప్రజల కష్టాలు తీరుతాయి.’’ అని టీడీపీ పొలిట్బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
![త్వరలో సైకో పాలన అంతం](https://media.andhrajyothy.com/media/2023/20231205/31_gsk_1_f90a34665a.jpg)
రాష్ట్రంలో రామరాజ్యం రాబోతోంది: బొండా ఉమా
సత్యనారాయణపురం, డిసెంబరు 31: ‘‘రాష్ట్రంలో త్వరలో సైకోపాలన అంతమవు తుంది. రామరాజ్యం రాబోతోంది. ప్రజల కష్టాలు తీరుతాయి.’’ అని టీడీపీ పొలిట్బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సత్యనారాయణపురం 33వ డివిజన్ జనరల్బాడీ సమావేశాన్ని ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. వైసీపీనీ ఎప్పుడు బంగాళాఖాతంలో కలుపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, కష్టపడి పనిచేసే వారికి ఎపుడూ టీడీపీలో గుర్తింపు ఉంటుందని, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకరలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని ఉమా పిలుపునిచ్చారు. ఓటును అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డివిజన్ ఇన్చార్జి గార్లపాటి విజయకుమార్,, అధ్యక్షుడు ఎన్.కోటేశ్వరరావు, కార్యదర్శి సి.రవిబాబు, సి.శ్రీనివాస్, నాగయ్య, సాయి, కృష్ణప్రసాద్, విజయలక్ష్మి, రామలక్ష్మి పాల్గొన్నారు.