టీడీపీ ప్రభుత్వంలోనే బీసీలకు రక్షణ
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:43 AM
టీడీపీ ప్రభు త్వంలోనే బీసీ లకు రక్షణ ఉం టుందని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర నాయ కుడు దొంతు చిన్నా అన్నారు.
గుణదల, ఏప్రిల్ 18: టీడీపీ ప్రభు త్వంలోనే బీసీ లకు రక్షణ ఉం టుందని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర నాయ కుడు దొంతు చిన్నా అన్నారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంలో జయహో బీసీ సదస్సును గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్నా మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ కార్పొరేషన్ను రద్దు చేసి బీసీలకు ఎంతో అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు బీసీ కార్పొరేషన్ ఏర్పా టు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రుణాలు మం జూరు చేసేవారని ఆయన తెలిపారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికా రంలోకి వస్తే మహిళలకు రక్షణ కల్పిస్తుందని, బీసీలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. బీసీలు ఐక్యమత్యంగా ఉండి వైసీపీని తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ రూరల్ మండల అధ్య క్షుడు గొడ్డళ్ల చినరామారావు, నబిగాని కొండ, అద్దేపల్లి సాంబ శివనాగరాజు, పట్టపు చంటి, జె.శ్రీనివాసరావు, బి.అరుణాబి, టి.శివలీల, అంజిబాబు, రామ కృష్ణంరాజు, పుణ్యవతి, భరత్, వర్మ పాల్గొన్నారు.