చంద్రబాబు సీఎం కావాలని అజ్మీర్లో ప్రార్థనలు
ABN , Publish Date - Feb 27 , 2024 | 01:17 AM
అజ్మీర్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం నాయకులు
![చంద్రబాబు సీఎం కావాలని అజ్మీర్లో ప్రార్థనలు](https://media.andhrajyothy.com/media/2024/20240224/26_ibm_2_72b458b022.jpg)
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవ్వాలని, చంద్రబాబు సీఎం అవ్వాలని, మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలవాలని అజ్మీర్ దర్గాలో ఇబ్రహీంపట్నానికి చెందిన ముస్లిం నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈనెల 21న ప్రత్యేక చాదర్ను తీసుకొని ఇక్కడి నుంచి అజ్మీర్ ప్రయాణం చేశారు. అక్కడ చాదర్ను సమర్పించారు. మహబూబ్ సుభాని, జిలాని, కరిముల్లా, ఇబ్రహీం, షమీవుల్లా, నాగుల్మీరా పాల్గొన్నారు.