పోలీసులను అడ్డుపెట్టుకుని అధికారం చెలాయిస్తున్నారు
ABN , Publish Date - Feb 27 , 2024 | 01:00 AM
పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు అధికారం చెలా యిస్తున్నారని, టీడీపీ పెనమలూరు ఇన్చార్జి బోడె ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదా రుల సమావేశం నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన పార్టీ కౌన్సిలర్లు, నాయకు లు, కార్యకర్తలను సోమవారం కలుసుకుని వివ రాలు తెలుసుకున్నారు.
ఉయ్యూరు, ఫిబ్రవరి 26 : పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు అధికారం చెలా యిస్తున్నారని, టీడీపీ పెనమలూరు ఇన్చార్జి బోడె ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదా రుల సమావేశం నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన పార్టీ కౌన్సిలర్లు, నాయకు లు, కార్యకర్తలను సోమవారం కలుసుకుని వివ రాలు తెలుసుకున్నారు. టిడ్కో ఇళ్ల గురించి లబ్ధిదా రుల తరఫున అధికారులను అడిగేందుకు వెళ్లిన వారిని ఏ విధంగా తీసుకువచ్చి నిర్భందిస్తారని సీఐ హబీబ్ బాషాను ప్రశ్నించారు. కమిషనర్ ఆహ్వానం మేరకు సమావేశానికి వెళ్లిన కౌన్సిలర్లను అరెస్టు చేసి తీసుకు వస్తారా అని ప్రశ్నించారు. ఈ సంద ర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మంత్రి జోగి రమేశ్ టిడ్కో ఇళ్లుపూర్తిచేసి ఇస్తామని మరో నాటకానికి తెర లేపారని, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి ఇప్పటివరకు నిర్మాణం ఎందుకు పూర్తి చేసి లబ్ధిదా రులకు అప్పగించలేదని ప్రశ్నించారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి..
ఉయ్యూరు పట్టణం, మండల పరిధి గ్రామాల నుంచి పలువురు వైసీపీ నాయకులు సోమవారం టీడీపీలో చేరారు. నగర పంచాయతీ చైర్మన్ వల్లభ నేని వెంకటేశ్వరరావుతో పాటు 2వ వార్డు కౌన్సిలర్ వి సుభద్రాదేవి, 3వ వార్డు కౌన్సిలర్ తెనాలి పద్మ, 7వ వార్డు కౌన్సిలర్ వడుపు గంగాభవాని, 13వ వార్డు కౌన్సిలర్ పైలా శ్రీనివాసరావు, 14వ వార్డు కౌన్సిలర్ కోరాడ వెంకటలక్ష్మి, 18వ వార్డు కౌన్సిలర్ నూర్జహాన్, కో-ఆప్షన్ సభ్యురాలు అడపాక ఆదిల క్ష్మి టీడీపీలో చేరారు. ముదునూరు సర్పంచ్ మొవ్వ వెంకటలక్ష్మి, కాటూరు సర్పంచ్ కొడాలి ఆశాజ్యోతి, కాటూరు ఎంపీటీసీ తోట శ్రీలక్ష్మితో పాటు పీఏసీ ఎస్ మాజీ చైర్పర్సన్లు, నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేశ్ సమక్షంలో మంగళగిరిలో టీడీపీ కండువా కప్పుకున్నారు.