Share News

పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:26 AM

ఎన్నికలలో ప్రజలకు భరోసా కల్పిస్తూ, శాంతి, భద్రతల పరిరక్షణకు తామున్నామని చెబుతూ మంగళవారం కృష్ణలంకలో సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 50 మంది సివిల్‌, ఏఆర్‌, పారా మిలటరీ విభాగాల ఫ్లాగ్‌మార్చ్‌ జరిగింది.

పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

వన్‌టౌన్‌, మార్చి 26: ఎన్నికలలో ప్రజలకు భరోసా కల్పిస్తూ, శాంతి, భద్రతల పరిరక్షణకు తామున్నామని చెబుతూ మంగళవారం కృష్ణలంకలో సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 50 మంది సివిల్‌, ఏఆర్‌, పారా మిలటరీ విభాగాల ఫ్లాగ్‌మార్చ్‌ జరిగింది. సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించు కునేందుకు పోలీసులు అండగా ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసులదేనని తెలిపారు.

Updated Date - Mar 27 , 2024 | 12:26 AM